హైదరాబాద్, మార్చి 30 : రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన "రంగస్థలం" చిత్రం నేడు విడుదలై అభిమానుల నుండి మంచి పాజిటివ్ టాక్ నే తెచ్చుకుంది. అయితే యూఎస్ లో ఈ సినిమా ప్రీమియర్ షోల ద్వారా భారీ వసూళ్లను రాబట్టింది. యూఎస్ లో 142 సెంటర్స్ లో విడుదలైన ఈ సినిమా.. కేవలం ప్రీమియర్ షోల ద్వారానే 6.2 లక్షల డాలర్లను రాబట్టింది. అంతేకాదు ప్రీమియర్ షోల ద్వారా అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 10 చిత్రాల్లో "రంగస్థలం" 6వ స్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది. ఇది చరణ్ కెరీర్ లోనే మొదటిసారి కావడం విశేషం. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత కథానాయికగా నటించింది. జగపతిబాబు, ఆదిపినిశెట్టి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు.