లండన్, మార్చి 30: భారతీయ బ్యాంకులకు రూ.9,000 కోట్ల బకాయిలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా మూడో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మాల్యా తాను యాజమానిగా వ్యవహరించిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో పనిచేస్తున్న పింకీ లాల్వానీ అనే యువతిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మాల్యా పెళ్లికి బాలీవుడ్ తారలు హాజరుకానున్నట్లు సమాచారం. కింగ్ఫిషర్ క్యాలెండర్కు మోడల్స్గా వ్యవహరించిన దీపిక పదుకొణె, కత్రినా కైఫ్, నర్గిస్ ఫక్రి తదితరులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.