హైదరాబాద్, మార్చి 27 : బెల్లంకొండ శ్రీనివాస్.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తో మాత్రమే నటిస్తూ వస్తున్నాడు. సాధారణంగా కొత్తగా అడుగులు వేసే హీరోలు కొత్త బ్యూటీలనే సెలెక్ట్ చేసుకుంటారు. కాని బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం ఇప్పటికే సమంత, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్స్ తో నటించాడు. ప్రస్తుతం ఇతని కన్ను కాజల్ అగర్వాల్ పై పడింది. కాజల్ వేరే ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నప్పటికీ బెల్లంకొండ ఆఫర్ ని ఓకే చేయడం విశేషం. ఇదిలా ఉండగా శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడితో బెల్లంకొండ ఒక నూతన ప్రాజెక్ట్ కు ఓకె చెప్పాడు. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లినట్లు చిత్ర బృందం వెల్లడించింది. అందులో కథానాయికగా కాజల్ ను సెలెక్ట్ చేశారు. ఈ సినిమా కథ వినగానే కాజల్ ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మరో కథానాయికకు స్థానం ఉన్నట్లు సమాచారం. మరి ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.