హైదరాబాద్, మార్చి 27 : గత కొంత కాలంగా టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో అవకాశాలు రావాలంటే తలొగ్గాల్సిందేనని విమర్శలు చేస్తూ వస్తుంది. తాజాగా దర్శకుడు అజయ్ కౌండిన్యపై షీటీమ్స్ కి ఫిర్యాదు చేస్తానని పేర్కొంది. శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో "డైరెక్టర్ అని పేరు తగిలించుకుని ఒక్క సినిమా కూడా రిలీజ్ అవకుండా డైరెక్టర్ల అందరి పరువు తీసే అజయ్ కౌండిన్యా... నువ్వు జైలుకు వెళ్లడం ఖాయం. నోటికి దురదగొండాకు రాసుకుని ఎరిగే నీ మీద తెలంగాణ షీ టీమ్ కు, ఉమెన్ కమిషన్ కు ఫిర్యాదు చేయబోతున్నా. కొందరు యువతులు నా పేరు చెప్పుకుని పాపులర్ అవాలని భావిస్తున్నారు. వారికి ఆల్ ది బెస్ట్" అని వెల్లడించింది.