రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు..

SMTV Desk 2018-03-25 13:26:19   gunfire, Injures, real estate, busnessman, Vizianagaram

విజయనగరం, మార్చి 25: విజయనగరం పట్టణంలో ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య వివాదం చోటుచేసుకోవడంతో కాల్పులకు దారి తీసింది. స్థానికంగా నివాసం ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి నమ్మి అప్పలరాజుపై పాత నేరస్తుడు బొత్స మోహన్‌ తుపాకీతో కాల్పులు జరిపినట్లు తేలింది. గాయపడిన అప్పల రాజును విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.