కేంద్రంపై కాంగ్రెస్‌ అవిశ్వాస అస్త్రం..

SMTV Desk 2018-03-23 17:58:52   congress party, NDA governance, Mallikarjun KhargeJD Seelamno confidence motion

న్యూఢిల్లీ, మార్చి 23: ఎన్డీయే ప్రభుత్వం పై ఈ నెల 27న కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడుతుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. తీర్మానానికి సంబంధించి అనుమతి కోరుతూ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే నోటీసులు అందించారని వెల్లడించారు. తాము పెట్టబోయే అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని విమర్శించారు.