నారా కుటుంబంపై సినీనటి కవిత సంచలన వ్యాఖ్యలు

SMTV Desk 2018-03-22 12:54:41  BJP leader Kavitha, TDP MLC Rajendraprasad, Tollywood.

అమరావతి, మార్చి 22 : ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముకులు మద్దతు తెలుపుతలేరని .. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఏపీ ప్రజలు కురిపిస్తున్న కోట్లాది రూపాయలతో ఏసీ రూముల్లో కులుకుతున్నారా.. ? అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో ధుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై సినీనటి, బీజేపీ నాయకురాలు కవిత నిప్పులు చెరిగారు. మీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా టాప్ హీరోనే కదా... ఆయన ఎందుకు మాట్లాడటం లేదు... ఆయన ఏ ఏసీ రూములో కులుకుతున్నారా.. ? అంటూ ప్రశ్నించారు. ఏదైనా మాట్లాడేముందు మంచి, చెడ్డ చూసుకుని మాట్లాడాలని అన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ కూడా ఒక హీరోనే అనే విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. హైదరాబాదులోనే ఉంటూ బానిస బతుకులు బతుకుతున్నారంటూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కూడా దారుణమని కవిత అన్నారు. ఇప్పటికీ నారా కుటుంబం హైదరాబాదులోనే ఉన్నారని... వారు కూడా బానిస బతుకు బతుకుతున్నట్టేనా.. ? రాష్ట్రం విడిపోయిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు షిఫ్ట్ కాలేదు.. రెండేళ్లు ఆయన హైదరాబాదులోనే ఉన్నారని.. మీరు చెప్పిన దాని ప్రకారం చంద్రబాబు కూడా బానిస బతుకు బతికినట్టేనా.. ? అని ప్రశ్నలు గుప్పించారు.