టాలీవుడ్ పై ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఫైర్.. !!

SMTV Desk 2018-03-20 14:38:37  MLC Rajendra Prasad, Tollywood, TDP,

అమరావతి, మార్చి 20 : తెలుగు చిత్ర పరిశ్రమ పై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై సినీ నటులు, దర్శకనిర్మాతలు ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. హోదా కోసం 5 కోట్ల మంది తెలుగు ప్రజలు పోరాటం చేస్తుంటే.. మీరంతా మౌనంగా ఎందుకు ఉన్నారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు, ఎంపి కవిత కూడా మద్దతు ఇస్తుంటే.. మీకేమయిందని రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. తెలుగు ప్రజలు ఇస్తున్న వందల కోట్ల రూపాయల మత్తులో కూరుకుపోయారా... ? ఆ మత్తు నుంచి బయటకు రారా... ? అని మండిపడ్డారు. హైదరాబాదులో బానిస బతుకులు బతుకుతున్న మీరు.. ఏదైనా మాట్లాడితే తన్ని తరిమేసి, మీ ఆస్తులను లాక్కుంటరని భయపడుతున్నారా .. అని నిప్పులు చెరిగారు. తెలంగాణ ముఖ్యమంత్రే మద్దతు తెలిపుతుంటే.. మీకెందుకు భయమని ఎద్దేవా చేశారు.