హైదరాబాద్, మార్చి 18 : పండగ వేళ మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కౌడిపల్లి మండలం కన్నారంలో ఈత కోసం చెరువుకు వెళ్ళిన నలుగురు వ్యక్తులు ఇంతియాజ్(40), మహ్మద్ హఫీజ్(28), అహమ్మద్ అలీ(8), ఇషాక్ అలీ(11) హుదా(11) లు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను చెరువులో నుండి బయటకు తీసి పోస్టుమార్ట౦ నిమిత్తం నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.