గవర్నర్ ఉగాది శుభాకాంక్షలు..

SMTV Desk 2018-03-17 16:41:17  gavarnor, narasimhan, ugadhi festival, gavarnor wishes,

హైదరాబాద్, మార్చి 17 : రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ నరసింహన్.. శ్రీ విళంబినామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. "ఈ పర్వదినాన్ని తెలుగు ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా. అలాగే ఈ శ్రీ విళంబినామ సంవత్సర౦ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను" అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఉగాది వేడుకలను పురస్కరించుకొని నేటి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్‌కుమార్ తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.