న్యూఢిల్లీ, మార్చి 17 :ఢిల్లీలో జరగబోయే ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) సమావేశానికి తాము హాజరుకాలేమని పాక్ చెప్పింది. భారత్, పాకిస్థాన్ మధ్య గత కొన్ని రోజులుగా దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. తమ రాయబారులు వేధింపులకు గురవుతున్నారంటూ ఇరు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. మార్చి 19,20 తేదీల్లో ఢిల్లీ వేదికగా డబ్ల్యూటీవో మంత్రిత్వ స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరుకావాలని పాక్ వాణిజ్యశాఖ మంత్రి పర్వేజ్ మాలిక్కు గత నెలలో భారత్ ఆహ్వానం పంపింది. అయితే ప్రస్తుతం ఆయన ఈ సమావేశానికి రావడం లేదట. ‘ఇటీవల ఇరు దేశాల మధ్య చోటుచేసుకున్న విభేదాల నేపథ్యంలో డబ్ల్యూటీవో సమావేశం నుంచి పాకిస్థాన్ తప్పుకుంటుంది’ అని పాక్ దౌత్యవర్గాలు తెలిపాయి.