ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఐపీఎల్‌ టికెట్లు ..

SMTV Desk 2018-03-16 14:03:58  ipl tickets, ipl season-11, mumbai indians, chennai super kings

ముంబయి, మార్చి 16 : ఐపీఎల్‌ -11సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా కొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ టిక్కెట్ల అమ్మకాలు మొదలయ్యాయి. ఏప్రిల్‌ 7న ఐపీఎల్‌ 11వ సీజన్‌ ఆరంభం కానుంది. టిక్కెట్ల అమ్మకాలకు కౌంటర్లు తెరచినట్లు ముంబయి ఫ్రాంఛైజీ వెల్లడించింది. టిక్కెట్ల ధరల ధరలు కనిష్ఠంగా రూ.800 నుంచి గరిష్ఠంగా 8,000 మధ్య వివిధ స్థాయిల్లో ఉన్నాయి. క్రికెట్ అభిమానులు ముంబయి ఇండియన్స్‌ సైట్‌ (www.mumbaiindians.com)నుండి ఆన్‌లైన్లో టిక్కెట్లు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ ముంబయిలోని వాంఖడే స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.