న్యూఢిల్లీ, మార్చి 16: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారాన్నిబయటకు రాకుండా కేంద్రం ప్రయత్నించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. మీ హయాంలోనే ‘ఎస్ఎస్సీ కుంభకోణం జరిగిందని, ఎందుకు సమర్థించుకొంటున్నారో సమాధానం చెప్పండి’’ అని మోదీని ఉద్దేశిస్తూ ట్విటర్లో రాహుల్ వ్యాఖ్యలు చేశారు.