న్యూఢిల్లీ, మార్చి 15: దేశ రాజధాని ఢిల్లీలో సీబీఎస్ఈ అకౌంటెన్సీ పరీక్ష రెండోసెట్ ప్రశ్నాపత్రం లీకైంది. గురువారం జరగాల్సిన 12 వ తరగతి అకౌంటెన్సీ పరీక్ష ప్రశ్నాపత్రం నిన్న సాయంత్రమే సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. ఈ ప్రశ్నాపత్రం సోషల్ మీడియా, మేనేజింగ్ యాప్ వాట్సాప్లో పెట్టినట్లు గుర్తించారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఈ ప్రశ్నాపత్రం లీకైంది. కాగా దీనిపై ఢిల్లీ విద్యాశాఖా మంత్రి మనీశ్ సిసోడియా స్పందించారు. అకౌంటెన్సీ ప్రశ్నాపత్రం లీకైనట్లు తనకు ఫిర్యాదులు అందాయని ట్వీట్ చేశారు. దీనిపై డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అధికారులను దర్యాప్తునకు ఆదేశించారు.