ముంబై, మార్చి 12 : ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్ )11వ సీజన్ టైటిల్ కొత్త స్పాన్సర్ని బీసీసీఐ వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ 4 నుండి ఐపీఎల్-11 మెగా టోర్నీ ప్రారంభం కానుంది. కాగా వచ్చే ఐదు సంవత్సరాల కాలానికి టైటిల్ స్పాన్సర్గా పేటీఎం వ్యవహరించనున్నట్లు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. 2018 సీజన్ నుంచి 2022 వరకూ పేటీఎం సంస్థ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ని రూ.439.8 కోట్ల వెచ్చించినట్లు సమచారం.