ఈ సారి గోపీచంద్ పైన

SMTV Desk 2017-06-28 15:49:41  pullela gopichand, badminton,

హైదరాబాద్, జూన్ 28 : ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారుడు అయిన పుల్లెల గోపీచంద్ పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఈయన జీవితం ఆధారంగా బయోపిక్ రాబోతుంది. బాలీవుడ్ డైరెక్టర్ అయిన విక్రమ్ మల్హోత్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు అలాగే హిందీలో కూడా ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు. "నా పై సినిమా వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా విక్రమ్ తీసే ఈ చిత్రం ద్వారా బ్యాట్మింటన్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్దిచెంతుందని ఆశిస్తున్నాను" అని గోపీచంద్ మీడియాతో చెప్పారు. ఈయన 2001 లో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాట్మింటన్లో ఛాంపియన్ షిప్ ను గెలుచుకున్నారు. దీపిక పదుకుణే తండ్రి ప్రకాష్ పదుకుణే తర్వాత ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారుడిగా పేరు పొందింది గోపీచందే. ఆ తరువాత ఈయన తన సొంత తెలివితేటలను ఉపయోగించి హైదరాబాద్ లో అకాడమీ ను ప్రారంభించారు. గోపీచంద్ శిక్షణలో పీవీ సింధు ఒలింపిక్ రజత పతాకం గెలుచుకుంది. ఇప్పుడు పీవీ సింధుపై కూడా బయోపిక్ వస్తుండటం గమనార్హం. నటుడు అలాగే నిర్మాత అయిన సోను సూద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.