న్యూఢిల్లీ, మార్చి 9 : ఏపీ టీడీపీ సభ్యులు అశోక్గజపతిరాజు, సుజనా చౌదరిల రాజీనామాలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. రాష్ట్రానికి న్యాయ౦ చేయడంలో కేంద్రం విఫలమైన కారణంతో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్గజపతిరాజు, శాస్త్రసాంకేతిక శాఖ సహాయమంత్రిగా సుజనా చౌదరిలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ప్రధాని నరేంద్రమోదీని కలిసి సంయుక్తంగా రాజీనామా లేఖలు సమర్పించారు. ఈ పరిస్థితికి కారణాలను వివరిస్తూ.. రాష్ట్రపతిని సంబోధి౦చి రాసిన రాజీనామా పత్రాన్ని ఆ లేఖకు జత చేశారు. తమ రాజీనామాలను ఆమోదించాలని కోరగా కేంద్రం ఆ లేఖలను రాష్ట్రపతికి పంపించింది. ఆ లేఖలను పరిశీలించిన రాష్ట్రపతి నేడు వారి రాజీనామాలకు ఆమోద ముద్ర వేశారు.