అధికారంలోకి రాగానే "హోదా" ఇస్తాం : రాహుల్

SMTV Desk 2018-03-06 19:14:33  rahul gandhi, special status, new delhi,

న్యూఢిల్లీ, మార్చి 6 : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశాడు. ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన "ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష" లో పాల్గొన్న రాహుల్ ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రత్యేక హోదా అంశం విషయంలో అండగా ఉంటామన్నారు. 2019లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామన్నారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో పలువురు నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ధర్నాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు సహా పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.