ముద్దుకృష్ణమకు ఏపీ శాసనమండలి నివాళి..

SMTV Desk 2018-03-06 12:07:03  ap legislative meetings, cm chandrababu, gali muddu krishnamanaidu, amaravathi.

అమరావతి, మార్చి 6 : ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే దివంగత నేత గాలిముద్దుకృష్ణమకు ఏపీ శాసనమండలి నివాళులర్పించింది. ఈ నేపథ్యంలో సంతాప తీర్మానంపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ముద్దుకృష్ణమ మృతి చాలా బాధాకరమని ఆవేదన వ్యక్త౦ చేశారు. నిరంతరం ప్రజల మధ్య ఉండాలనుకునే వ్యక్తి అని, ఆరు సార్లు ఎమ్మెల్యే, మూడు సార్లు మంత్రిగా కొనసాగుతూ.. నిత్యం ప్రజాసేవకై పరితపించేవారని కొనియాడారు. అనంతరం శాసనమండలి రేపటికి వాయిదా పడింది.