న్యూఢిల్లీ, మార్చి 5 : త్రిపుర, నాగాలాండ్ లో బీజేపీ విజయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. "ఈశాన్య రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నా.. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు ప్రత్యేక కృతజ్ఞతలు. పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని విధాలా కృషి చేశాం" అంటూ పేర్కొన్నారు.