ముంబై, ఫిబ్రవరి 28 : అందాలతార శ్రీదేవి అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆమెకు అన్ని ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శ్రీదేవిని కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. శ్రీదేవి ఒకానొక సందర్భంలో తన అంతిమయాత్రకు సంబంధించి అంతా తెలుపు రంగులో ఉండాలన్నది తన ఆకాంక్షని అన్నారట. దీంతో ఆమె కోరిక మేరకే అంతిమయాత్రకు ఉపయోగించే వాహనం మొత్త౦ వివిధ రకాల తెల్లపూలతో అలంకరించి లోపల ఆమె చిత్రపటాన్ని ఉంచారు. ప్రస్తుతం సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్ నుండి శ్రీదేవి అంతిమయాత్ర ప్రారంభమైంది.