నాగాలాండ్ లో బాంబు పేలుడు..

SMTV Desk 2018-02-27 13:45:58  nagaland, polling center, bomb incident, maan district

నాగాలాండ్, ఫిబ్రవరి 27 : ప్రశాంతంగా సాగుతున్న నాగాలాండ్ శాసనసభ ఎన్నికల్లో ఓ పోలింగ్‌ కేంద్రంలో బాంబు పేలుడు కలకలం రేపింది. మాన్‌ జిల్లా తిజిత్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ బాంబు పేలుడులో ఒకరికి గాయాలయ్యాయి. ఉదయం 7.00 గంటలకు మొదలైన పోలింగ్ మిగతా చోట్ల సాఫీగా కొనసాగుతుంది. మేఘాలయ, నాగాలాండ్‌ సహా ఇప్పటికే ఎన్నికలు ముగిసిన త్రిపుర రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మార్చి 3న వెల్లడిస్తారు.