అశ్విన్‌ తొలిసారిగా..

SMTV Desk 2018-02-27 12:54:43  ashwin, punjab kings x1, captain, sehwag

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 : ఐపీఎల్‌-11వ సీజన్ కోసం పంజాబ్‌ XI జట్టు కెప్టెన్ గా భారత్‌ ఆల్‌ రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ భాద్యతలు చేపట్టనున్నాడు. ఈ మేరకు ఫ్రాంఛైజీ నిర్ణయాన్ని జట్టు డైరెక్టర్‌‌, మెంటార్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు. ఐపీఎల్ లో సారథిగా వహించడం అశ్విన్ కు ఇదే తొలిసారి. ఇంతకు ముందు ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ పంజాబ్ జట్టు బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తొలి ఆరు ఐపీఎల్‌ టోర్నీలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడిన అశ్విన్ అనంతరం గత రెండు సీజన్లలో రైజింగ్‌ పుణె సూపర్‌ జైంట్‌ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. బెంగుళూరులో జరిగిన వేలంలో రూ.7.6 కోట్లకు పంజాబ్ అశ్విన్ ను దక్కించుకొంది. అయితే తొలుత యువరాజ్‌ సింగ్‌కు సారథ్య బాధ్యతలు ఇద్దామని అనుకున్నా.. తుదకు అశ్విన్‌ ఎంపికకే ఫ్రాంచైజీ మొగ్గు చూపింది.