హైదరాబాద్, ఫిబ్రవరి 25 : తన అందం. అభినయంతో యావత్ దేశాన్ని కట్టిపడేసిన అతిలోక సుందరి శ్రీదేవి అకాల మరణం చిత్ర పరిశ్రమను, అభిమానుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ నేపథ్యంలో ఆమెను ఎంతగానో ఆరాధించే దర్శకుడు రామ్గోపాల్ వర్మ తీవ్ర మనో వేదనకు గురయ్యారు. ఆమెపై ఎంతో అభిమానాన్ని పెంచుకున్న ఆయన ఆ ఇష్టాన్ని తెలుపుతూ.. వరుస ట్వీట్లు చేశారు. ఇదే శ్రీదేవిపై తన చివరి ట్వీట్ అంటూ తెలుపుతూ వర్మ ఒక ట్వీట్ తో పాటు వీడియోను పోస్టు చేశారు. "శ్రీదేవి గురించి ఇదే నా ఆఖరి ట్వీట్.. ఇప్పటి నుంచి తను ఇంకా బతికుందనే ఊహించుకుంటాను. శ్రీదేవి.. నేను మిమ్మల్ని ఎంత నవ్వించినా మీరు నన్నింతగా ఏడిపించడం అన్యాయం. ఇంకెప్పటికీ మీతో మాట్లాడను. లైఫ్ లాంగ్ కటీఫ్" అని పేర్కొన్నారు.