బీసీలకు రెండు రాజ్యసభ సీట్లు కేటాయించాలి : జాజుల

SMTV Desk 2018-02-25 14:43:05  telangana, rajyasabha seas, bc, jujula srinivas goud, trs

హైదరాబాద్, ఫిబ్రవరి 25 ‌: వచ్చే నెల 23 న పెద్దల సభ సమరంకు ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చెరో మూడు స్థానాలుకు జరగనున్నాయి. కాగా అందులో రెండు సీట్లు బీసీలకు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ యాదవ సామాజిక వర్గానికి ఒక రాజ్యసభ స్థానం కేటాయిస్తామన్న సీఎం ప్రకటనను ఆహ్వానిస్తున్నామని, మరో స్థానాన్ని అత్యంత వెనకబడిన కులాలకు లేదా సంచార జాతుల్లో ఒకరికి ఇవ్వాలని అన్నారు.