బీసీసీఐకి ఐపీఎల్ ద్వారా కాసుల పంట..

SMTV Desk 2018-02-13 16:14:02  IPL, BCCI, STAR INDIA, CRICKET LEAGUE,

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 : దశాబ్ధకాలంగా క్రికెట్ అభిమానులకు ఎంతో వినోదాన్ని పంచిన మెగా టోర్నీ ఐపీఎల్. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఐపీఎల్ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అంతే కాకుండా బీసీసీఐకి కాసుల వర్షం కురిపించే కల్పవృక్షంగా మారింది. తాజా గణాంకాల ప్రకారం 2018-19 మధ్యకాలంలో సుమారు రూ. 2,017 కోట్ల మిగులు ఆదాయాన్ని బీసీసీఐ ఆర్జించనుంది. ప్రసార హక్కుల కోసం స్టార్‌ ఇండియాతో సుమారు 16, 347 కోట్ల రూపాయలతో చేసుకున్న ఒప్పందం ఈ ఆదాయంనకు కారణం అని చెప్పవచ్చు.