ఆందోళనలను ఉధృతం చేయ౦డి : చంద్రబాబు

SMTV Desk 2018-02-08 11:10:28  cm chandrababu naidu, tdp mps, protest at parliament.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 : రాష్ట్ర విభజనల సమయంలో ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన హామీల అమలు కోసం పార్లమెంట్ లో ఆందోళనలను ఉధృతం చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలను ఆదేశించారు. ఈ మేరకు ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ పై అరుణ్ జైట్లీ సమాధానం చెప్పేటప్పుడు ఆందోళనలను కొనసాగించాలని, అలాగే రాజ్యసభలోనూ తమ గళాన్ని వినిపిస్తూ నిరసన తెలపాలని సూచించారు. మరోవైపు ఇప్పటికే ఏపీ బంద్‌కు రాష్ట్రంలో అన్ని వర్గాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.