ముంబై, ఫిబ్రవరి 6 : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రధాన కార్యాలయం అడ్డా మారనుందా.. అంటే అవుననే అంటున్నాయి సంబంధిత వర్గాలు. బీసీసీఐ ప్రధాన కార్యాలయం ముంబై నుంచి బెంగళూరుకు మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో బీసీసీఐ ప్రధాన కార్యాలయం ఉంది. బీసీసీఐ అధికారులు హెడ్క్వార్టర్స్ను బెంగళూరుకు మార్చాలనే యోచన చేస్తున్నారు. బెంగుళూరులో బీసీసీఐకి 40 ఎకరాల భూమి ఉంది. అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో జాతీయ క్రికెట్ అకాడమీ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.