న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 : భారత అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు బీసీసీఐకు కేరళ పేసర్ శ్రీశాంత్ బ్యాన్ పై నాలుగు వారాల్లోగా పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో జీవిత కాల నిషేధం ఎదుర్కొంటున్న కేరళ పేసర్ శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సోమవారం అతని అభ్యర్థన పిటిషన్పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు నోటీసులు పంపింది. 2013లో ఐపీఎల్లో శ్రీశాంత్ ఫి క్సింగ్కు పాల్పడినట్లు బలమైన ఆధారాలు ఉన్నందునే అతనిపై జీవితకాల నిషేధం విధించినట్లు బీసీసీఐ గతంలో వెల్లడించింది.