వరంగల్, ఫిబ్రవరి 4: ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ సీనియర్ నేత సినీ నిర్మాత టి.సుబ్బిరామిరెడ్డి వరంగల్ లోని వేయి స్తంభాల ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్కల్యాణ్ కాంబినేషన్ లో త్వరలో ఓ చిత్రాన్ని రూపొందిస్తామని అన్నారు. కథ సిద్ధం కాగానే షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. మార్చి 11న వరంగల్లో కాకతీయ వైభవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.