హైదరాబాద్, ఫిబ్రవరి 4 : తెలంగాణను "గ్రీన్ స్టేట్" గా మారుస్తామని పంచాయతీరాజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. టౌన్ ప్లానర్ల 66వ జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జూపల్లి ఈ సందర్భంగా మాట్లాడారు. కొత్త రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ దేశంలోనే అగ్రపథంలో దూసుకుపోతుందన్నారు. పరిశ్రమలకై అనుమతి మంజూరు చేసే టీఎస్ఐపాస్ వంటి పాలసీలు దేశంలోనే ఎక్కడ లేవన్న ఆయన.. పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ప్రొఫెసర్ వీఎన్ ప్రసాద్ పేరిట అందజేసే నేషనల్ బెస్ట్ థీసిస్ బహుమతులను అందజేశారు. ఈ టౌన్ ప్లానర్ల సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరై నిపుణులకు పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే.