2018-19 బడ్జెట్ : క్రీడలకు రూ.2,196 కోట్లు..

SMTV Desk 2018-02-02 14:42:30  2018-19 budget, khelo india, arun jaitley, sai academy,

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2 : కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రవేశ పెట్టిన 2018-19 బడ్జెట్ లో క్రీడా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. గత ఏడాదితో పోలిస్తే క్రీడా బడ్జెట్‌ రూ.258.2 కోట్లు పెరగడం విశేషం. గత సంవత్సరం బడ్జెట్‌ రూ.1938.16 కోట్లు కాగా ఈసారి అది రూ.2196.36 కోట్లకు చేరింది. అయితే కేంద్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌)కు కేటాయించే నిధులు కోత విధించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ఖేలో ఇండియా’ పథకం కోసం రూ.520.09 కోట్లు ఇచ్చారు. నిరుడు దీని కోసం కేటాయించిన బడ్జెట్‌ రూ.350 ప్రతిపాదించారు.