గుంటూరు, ఫిబ్రవరి 1 : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. “యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్” శంకుస్థాపన నిమిత్తం జిల్లాకు రానున్న నేపథ్యంలో అక్కడ జరిగే ఏర్పాట్లను రూరల్ ఎస్పీ అప్పలనాయుడు పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. శంకుస్థాపన జరిగే ప్రాంతం సహా చుట్టూ పక్కన పార్కింగ్ ప్రదేశాలలో భద్రతపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.