న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 : లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. లోక్ సభ సోమవారానికి వాయిదా పడిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ తో జీవన విధానం సులభతరంగా మారుతు౦దన్న ఆయన ఆర్ధిక మంత్రి జైట్లీపై ప్రశంసల వర్షం కురిపించారు. వ్యవసాయం సహా మౌళిక సదుపాయాల కల్పన వరకు బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్నారు. ఈ బడ్జెట్ ద్వారా గ్రామీణ భారతానికి సరికొత్త అవకాశాలు వస్తాయన్నారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించడం గొప్ప నిర్ణయం అంటూ ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుందంటూ పేర్కొన్నారు.