హైదరాబాద్, జనవరి 31 : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శైలేంద్ర కుమార్ జోషి నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ ఎస్పీ సింగ్ పదవీకాలం నేటితో ముగియనుండగా నూతన సీఎస్గా జోషిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1984 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఈయన 1977-1981 మధ్య కాలంలో ఇంజినీరింగ్(ఈసీఈ) ఐఐటీ రూర్కీలో చదివారు. ఢిల్లీ ఐఐటీ నుండి పీజీ చేసి 2010లో పీహెచ్డీ పట్టా పొందారు. నెల్లూరు, తెనాలి, వికారాబాద్, కృష్ణా జిల్లాలో జాయింట్ కలెక్టర్గా, కలెక్టర్గా పలు సేవలందించారు. ఈ సందర్బంగా తనకు ఈ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు జోషి కృతజ్ఞతలు తెలిపారు. తన శక్తిసామర్థ్యాల మేరకు రాష్ట్ర ప్రజలకు సేవచేసేందుకు పునరంకితమవుతానని పేర్కొన్నారు.