హైదరాబాద్, జనవరి 31 : తెరాసాపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఒకవైపు 24 గంటల విద్యుత్ ఇస్తామంటూనే మరోవైపు రోజంతా విద్యుత్ అవసరం లేదంటూ తీర్మానాలు చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం విద్యుత్ పంపిణీపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం సైతం కలల పథకంలాగే మిగిపోతు౦దని ఎద్దేవా చేశారు. తెలంగాణ సర్కార్ పాలన సంపూర్ణ వైఫల్యాల పుట్ట అన్నారు. తెలుగుదేశం ఒక నిర్దిష్ట కార్యాచరణతో ముందుకెళ్తు౦దని అన్నారు.