న్యూఢిల్లీ, జనవరి 30: భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు, జాతిపిత మహాత్మ గాంధీ (మోహన్ దాస్ కరంచంద్ గాంధీ) వర్ధంతి నేడు. ఈ సందర్బంగా దేశ రాజధానిలోని ఆయన సమాధి రాజ్ఘాట్ వద్ద రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఆ మహాత్ముడి సేవలను స్మరించుకున్నారు.