అర్హులైన రైతులకు రుణమాఫీ : సోమిరెడ్డి

SMTV Desk 2018-01-29 18:33:10  AP AGRICULTURE MINISTER,SOMIREDDY CHANDRAMOHAN REDDY, KISAN MELA.

విశాఖ, జనవరి 29 : అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ సాయం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. అనకాపల్లిలో నిర్వహించిన కిసాన్ మేళాలో పాల్గొన్న మంత్రి సోమిరెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ కింద జిల్లాకు రూ.10 కోట్ల మేర నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ద్రవ జీవన ఎరువుల ఉత్పత్తి, పరిశోధన కేంద్రాలను మంత్రి పరిశీలించారు. సోమిరెడ్డి తో పాటు ఈ సమావేశంలో గంటా శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.