హైదరాబాద్, జనవరి 29 : ఎమ్మార్పీఎస్ కు తన మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. ఎమ్మార్పీఎస్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ కులపిచ్చి ఉద్యమం కాదని, కుల స్పృహ కల్గిన ఉద్యమమ౦టూ గద్దర్ ఉద్ఘాటించారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి తానూ కూడా ఉడత భక్తిలా మద్దతు ఇస్తానంటూ ప్రకటించారు. ఆయనతో పాటు సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వానికి అడుగడుగునా చెక్ పెట్టగలిగిన సామర్థ్యం ఎమ్మార్పీఎస్కు ఉందని వెంకట్రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మందకృష్ణను జైల్లో పెట్టలేదు. అలాంటిది రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజా ఉద్యమాలపై నిర్భందం అమలు చేస్తోందని దుయ్యబట్టారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ వెంట తామంతా నడుస్తామని స్పష్టం చేశారు.