బీజేపీ- టీడీపీ మైత్రికి ఎటువంటి ఢోకా లేదు : మంత్రి నారాయణ

SMTV Desk 2018-01-28 23:42:54  P. NARAYANA, BJP, TDP, SRIKAKULAM

శ్రీకాకుళం, జనవరి 28 : బీజేపీ- టీడీపీ బంధానికి ఎటువంటి ఢోకా లేదని మంత్రి నారాయణ తెలిపారు. శ్రీకాకుళం పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “సమస్యలు ఉంటే అమిత్ షా, ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు చర్చిస్తారు. ప్రస్తుతం బీజేపీ- టీడీపీ మైత్రికి ఎటువంటి సమస్య లేదు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో ఆయనకే తెలియదు. 2019 లో జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు” అని వ్యాఖ్యానించారు.