ముంబై, జనవరి 28 : దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ-20 సిరీస్కు భారత జట్టును చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో సమావేశమైన సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఫిబ్రవరి 18, 21, 24 తేదీల్లో మొత్తం మూడు మ్యాచ్లు జరగనున్నాయి. టెస్ట్ సిరీస్ లో చివరి టెస్టును కోహ్లిసేన గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.ఆరు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవర్ 1న జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం టీమిండియా వన్డే జట్టు ఇప్పటికే సఫారీ గడ్డపై అడుగుపెట్టింది. భారత్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, ధోని, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, మనీష్ పాండే, అక్షర్ పటేల్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, జయదేవ్ ఉనద్కత్, శార్దుల్ ఠాకూర్.