దారుణ హత్యకు గురైన మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త

SMTV Desk 2018-01-25 14:31:53  muncipal chairperson, husband murdered, nalgonda, congress responce.

నల్గొండ, జనవరి 25 : నల్గొండ పురపాలక ఛైర్ పర్సన్ లక్ష్మీ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు ఆయన తలపై బండరాళ్ళతో మోదీ అతి కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని కాల్వలో పడేశారు. స్థానికుల సమాచార౦ మేరకు.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని శవాగారానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ హత్యపై రాజకీయ ప్రమేయముందని ఆరోపిస్తూ... కాంగ్రెస్ శ్రేణులు జిల్లా బంద్‌ చేపట్టాయి. ఈ హత్యపై సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. తన అనుచరుణ్ని అధికార పార్టీ నేతలే పొట్టన పెట్టుకున్నారని ఇందుకు తగిన సాక్ష్యాలున్నాయని స్పష్టం చేశారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యుల్ని పరామర్శి౦చి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు.