చెన్నై, జనవరి 25 : రాజస్థాన్లో గతేడాది ఎన్కౌంటర్లో మృతి చెందిన పోలీసు ఇన్స్పెక్టర్ పెరియపాండియన్ కుటుంబానికి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి రూ.కోటి చెక్కును అందజేశారు. ఇంతకు ముందు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కుటుంబానికి రూ.కోటి సాయం చేస్తామని వెల్లడించింది. అందులో భాగంగా బుధవారం సచివాలయంలో పెరియపాండియన్ భార్య భానురేఖ, కుమారులు రుబన్, రాహుల్లు ముఖ్యమంత్రి కలిసి ఈ సందర్భంగా రూ.కోటి చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. చెక్కును అందుకున్న భానురేఖ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.