హైదరాబాద్, జనవరి 22 : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రజాయాత్ర సందర్భంగా తన పార్టీ కార్యాలయంలో ప్రత్యేక మహిళా విభాగాన్ని అధికారికంగా ప్రారంభించారు. సోషల్ మీడియాలో "వీర మహిళ" అనే పేరుతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులుగా పని చేయడానికి ముందుకు వచ్చిన మహిళామణులకు పవన్ అభినందనలు తెలిపారు. జనసేన పార్టీ సిద్దాంతాలను, ఆశయాలను ప్రజలలోకి తీసుకువెళ్ళడమే కాకుండా ప్రజా శేయస్సు కోసం కృషి చేస్తూ.. దేశాభివృద్ధిలో మన౦ కూడా ఒక పాత్ర పోషిద్దామ౦టూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.