హైదరాబాద్, జనవరి 19 : ప్రముఖ బుల్లితెర యాంకర్ ప్రదీప్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఆయనకు కోర్టు మూడేళ్ల పాటు డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేసి 2,100 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా అతిగా మద్యం సేవించిన కేసులో ప్రదీప్ పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆయన కారును సీజ్ చేసి కౌన్సిలి౦గ్ కు ఆదేశించగా, తన తండ్రితో పాటు ప్రదీప్ కౌన్సిలింగ్ కు హాజరయ్యారు. కాగా మూడేళ్ల పాటు ఆయన ఎలాంటి వాహనం నడపడానికి వీలు లేదు.