నలుగురు న్యాయమూర్తులతో సీజేఐ భేటీ...

SMTV Desk 2018-01-18 13:18:14  CJI meeting with four judges, Supreme Court, delhi

న్యూఢిల్లీ, జనవరి 18 : చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు పాలనా వ్యవస్థ సరైన క్రమంలో లేదంటూ మీడియాకు తెలిపిన నలుగురు అత్యంత సీనియర్‌ న్యాయమూర్తులతో నేడు న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ దీపక్‌ మిశ్రా భేటీ అయ్యారు. కోర్టు ప్రారంభానికి ముందు దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగినట్లు కోర్టు వర్గాల నుంచి అందిన సమాచారం. అయితే, జస్టిస్‌ చలమేశ్వర్‌ ఆరోగ్య పరిస్థితి బాగోలేనందున ఆయన మినహా మిగతా ముగ్గురు న్యాయమూర్తులు రంజన్‌, కురియన్‌, మదన్‌ లోకూర్‌లతో సీజేఐ నిన్న కొద్ది సేపు భేటీ అయ్యారు. మరోమారు మళ్లీ ఈ రోజు కూడా సమావేశం నిర్వహించారు. కాగా, సీజేఏ మిశ్రాపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భేటీని నిర్వహించారా?లేదా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.