హైదరాబాద్, జనవరి 18 : నేడు విశ్వవిఖ్యాత నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళ్ళు అర్పించారు. ఎన్టీఆర్ కుమారులు హరికృష్ణ, బాలకృష్ణ, మనవలు ఎన్టీఆర్, కల్యాణ్రామ్ తదితరులు పుష్పాంజలి ఘటించారు. తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగు జాతి గుండె చప్పుడు అని అన్నారు. అనంతరం హరికృష్ణ మాట్లాడుతూ...తెలుగు భాష, తెలుగు వారు ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆ మహామనిషి జీవించే ఉంటారని ఆయన అన్నారు.