విజయవాడ, జనవరి 13 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఏటా సంక్రాంతికి కోడి పందేలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా కోడీ పందాలు నిర్వహించేందుకు నిర్వాహకులు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోడి పందాలకు నిర్వాహకులు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు హైకోర్టు తీర్పు ఆధారంగా కోడి పందాలను అడ్డుకునేందుకు కృష్ణా జిల్లాలోని బారుల వద్ద పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. కోడి పందాలు నిర్వహిస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. బారుల వైపు వెళ్లే రహదారులను మూసివేశారు. ఈ మేరకు జరగనున్న కోడి పందాలపై శుక్రవారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. గత ఏడాది సుప్రీం ఇచ్చిన తీర్పే ఈసారి కూడా వర్తిస్తుందని చీఫ్ జస్టిస్ బెంచ్ వెల్లడించింది.