ముంబై, జనవరి 13 : పవన్ హాన్స్ హెలికాప్టర్ ఈ ఉదయం అదృశ్యమై౦ది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఉద్యోగులతో ప్రయాణిస్తున్న ఈ హెలికాప్టర్.. ఉదయం 10.20గం. ముంబయిలోని జుహు విమానాశ్రయం నుంచి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం 10.58గంటలకు గమ్యస్థానానికి చేరుకోవాల్సిన హెలికాప్టర్ కు 10.30గం. సమయంలో ట్రాఫిక్ కంట్రోల్(ఏటీఎస్)తో సంబంధాలు తెగిపోయాయి. విషయం తెలుసుకున్న ఓఎన్జీసీ అధికారులు వెంటనే ఇండియన్ కోస్ట్ గార్డు సిబ్బందికి సమాచారం అందించి, గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి ఆ హెలికాప్టర్ కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. కాగా ఇందులో ఐదుగురు ఓఎన్జీసీ ఉద్యోగులు, ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఈ ఘటనలో ఒకరి మృతదేహం లభించగా, మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.