అమరావతి, జనవరి 13 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ-బీజేపీ నేతల వివాదంపై స్పందించారు. ఈ మేరకు తాడేపల్లిగూడెంలో జెడ్పీ చైర్మన్ బాపిరాజు, మున్సిపల్ చైర్మన్ వ్యాఖ్యలపై ఆరా తీసినట్లు సమాచారం. అంతేగాక, ఇరుపార్టీ నేతల మధ్య నెలకొన్న వివాదంపై టీడీపీ సీనియర్ నేతలతో చర్చించారు. ఈ వివాదంపై విచారణకు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, వర్మతో కమిటీ నియమించారు. కాగా, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదంటూ ఆయన హెచ్చరించారు.